ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు ఏపీలో 618 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2020-12-09 13:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు ఏపీలో 618 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనా కారణంగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,73,457 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 7,045 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 5,259 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో కోలుకున్న వారి సంఖ్య 8,61,153 మందికి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News