కాంగ్రెస్ – టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల ప‌ర‌స్ప‌ర దాడులు

సూర్యాపేట జిల్లాలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌చారాన్ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. చింత‌ల‌పాలెం మండ‌లం పీక్లానాయ‌క్ తండాలో ఇవాళ ఉత్త‌మ్ స్థానిక సంస్థ ఎన్నిక‌ల [more]

Update: 2019-05-10 11:49 GMT

సూర్యాపేట జిల్లాలో పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌చారాన్ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. చింత‌ల‌పాలెం మండ‌లం పీక్లానాయ‌క్ తండాలో ఇవాళ ఉత్త‌మ్ స్థానిక సంస్థ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. అయితే, ఉత్త‌మ్ మాట్లాడుతుండ‌గా కొంద‌రు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు ఆయ‌నను అడ్డుకున్నారు. దీంతో ఆగ్ర‌హించిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి చేశారు. ప్ర‌తిగా టీఆర్ఎస్ వారు కూడా రాళ్ల దాడికి పాల్ప‌డ్డారు. ప‌ర‌స్ప‌ర దాడుల్లో ప‌లువురికి గాయాల‌య్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Tags:    

Similar News