నల్లగొండ జిల్లాలో నాటు బాంబు దాడులు

రాజకీయ విభేదాలతో నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులకు దిగాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఇటీవలి గ్రామ [more]

Update: 2019-04-15 13:13 GMT

రాజకీయ విభేదాలతో నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామంలో రెండు వర్గాలు నాటు బాంబులతో పరస్పరం దాడులకు దిగాయి. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం నాయకునితండాలో ఇటీవలి గ్రామ పంచాయితీ ఎన్నికల నుంచి గ్రామస్థుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి కొండానాయక్.. టీఆర్ఎస్ అభ్యర్థి సక్కు నాయక్ పై విజయం సాధించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇవాళ మరోసారి ఓ వివాహవింధులో మళ్లీ ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పరస్పరం నాటు బాంబులతో ఇళ్లపై దాడులు చేసుకున్నారు. దీంతో పలు ఇళ్లు, సామాగ్రి ధ్వంసమయ్యాయి.

Tags:    

Similar News