పార్టీకి ఉత్తమ్ శనిలా దాపురించాడు

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి శని దాపురించి నిండా ముంచాడని, కావాలనే పార్టీకి నష్టం చేశారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-01-10 09:25 GMT

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి శని దాపురించి నిండా ముంచాడని, కావాలనే పార్టీకి నష్టం చేశారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత సర్వే సత్యనారాయణ ఆరోపించారు. ఇటీవల ఆయన పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున పీసీసీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఆయన ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ ఏకే ఆంటోనీని కలిసి వివరణ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇంఛార్జి కుంతియా చేసిన తప్పిదాల వల్లే పార్టీ ఓడిపోయిందని ఆయనకు వివరించారు. ఏఐసీసీ సభ్యుడినైన తనను సస్పెండ్ చేసే అధికారం పీసీసీకి లేదని సర్వే పేర్కొన్నారు. ఉత్తమ్, కుంతియాపై రాతపూర్వకంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారని స్పష్టం చేశారు.

Tags:    

Similar News