ఏమైంది చెప్మా…..

హుజూర్ నగర్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోవడం ఖాయమయింది. ఎందుకిలా జరిగిందని కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ అభివృద్ధే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు [more]

Update: 2019-10-24 06:46 GMT

హుజూర్ నగర్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోవడం ఖాయమయింది. ఎందుకిలా జరిగిందని కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ అభివృద్ధే తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నాయకులు జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్లని కూడా ప్రచారం చేసింది. చేతిలో ఉన్న సీటును చేజార్చుకున్న కాంగ్రెస్ నాయకులు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. గెలవక పోయినా టఫ్ ఫైట్ ఇస్తామని ఉత్తమ్ పద్మావతి భావించారు. కాంగ్రెస్ కు పట్టున్న మండలాల్లో సయితం మెజారిటీ రాకపోవడం ఆ పార్టీని ఆందోళనకు గురి చేస్తుంది. దారుణంగా ఓటమి దిశగా వెళ్లడం కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

 

Tags:    

Similar News