టీకాంగ్రెస్ లో అసంతృప్తి రేగుతోందా..?

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెమ్మదిగా అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఓటమిపై గళమెత్తారు. తెలుగుదేశం [more]

Update: 2018-12-26 07:20 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నెమ్మదిగా అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ఓటమిపై గళమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ ఎన్నికల్లో అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనొత్తేజం నింపాలంటే ఇప్పటికైనా పీసీసీలో ప్రక్షాళన జరగాలని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా టీపీసీసీ కమిటీల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News