కాంగ్రెస్ సంబరాలపై షా సెటైర్లు

Update: 2018-05-21 13:03 GMT

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుండటంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ పాలనకు పూర్తిగా వ్యతిరేకిస్తూ తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. జేడీఎస్ సైతం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారంతోనే 38 సీట్లు సాధించిందని, కానీ ఇప్పుడు అధికారం కోసం అవే రెండు పార్టీలు కలిసిపోయాయని, ఇది అపవిత్ర కలయిక అని పేర్కొన్నారు. కర్ణాటకలో ఏమి సాధించిందని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటుందని ప్రశ్నించారు? ఆ పార్టీకి చెందిన చాలా మంది మంత్రులు ఓడిపోయినందుకా, ముఖ్యమంత్రి కూడా ఒక స్థానంలో ఓడిపోయినందుకా, 122 సీట్ల నుంచి 78 సీట్లకు పడిపోయినందుకు సంబరాలు చేసుకుంటుందా ? అని ప్రశ్నించారు. కర్ణాటక ప్రజలు అతిపెద్ద పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కును బీజేపీకి ఇచ్చారని, కానీ కాంగ్రెస్ సుప్రీం కోర్టుకు అబద్ధాలు చెప్పిందని అన్నారు.

Similar News