సీఎం రమేష్ కంపెనీలపై....?

Update: 2018-10-13 03:16 GMT

నిన్న పోట్లదుర్తి గ్రామంలో సోదాలు నిలిసేసిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు రెండోరోజు కూడా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తుననారు. హైదరాబాద్ లోని సీఎం రమేష్ నివాసంలోనూ, ఆయనకు సంబంధించిన రిత్విక్ ప్రాజెక్టు సంస్థల్లోనూ రెండో రోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి. సీఎం రమేష్ ఇంటి నుంచి కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రెండో రోజు కూడా.....

సీఎం రమేష్ సమీప బంధువైన గోవర్థన్ నాయుడి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తెరచి చూసినట్లు తెలుస్తోంది. రిత్విక్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలను చూసే గోవర్థన్ నాయుడు కీలకంగా ఉండటంతో ఆయన ఇంట్లో కూడా సోదాలు చేశారు. అయితే ఏమేం పత్రాలు దొరికాయి? ఆదాయపు పన్నుశాఖ అధికారులు మాత్రం వెల్లడించడంలేదు.

Similar News