ఏపీ ప్రభుత్వంపై హోంశాఖకు ఫిర్యాదు చేసిన సీఎం రమేష్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వ తీరుపై హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఆయన అమిత్ షా [more]

Update: 2020-09-18 06:03 GMT

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ప్రభుత్వ తీరుపై హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. గతంలో తిరుపతి బస్సులో అన్యమత ప్రచారం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రమేష్ గుర్తు చేశారు. ఎవరో మెసేజ్ ఫార్వార్డ్ చేశారని ఎవరినో ఈ కేసులో అరెస్ట్ చేసిి మసిబూసి మారేడుకాయ చేశారన్నారు. ప్రశ్నించిన వారందరినీ అరెస్ట్ లు చేస్తున్నారని సీఎం రమేష్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం తీరు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News