విజయనగరం జిల్లా ఎస్.కోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ సభకు భారీ వర్షం, ఈదురుగాలులు ఆటంకం కలిగించాయి. ముఖ్యమంత్రి సభ ప్రారంభం కాగానే, భారీ ఈదురుగాలులతో వర్షం మొదలైంది. దీంతో సభా ప్రాంగణంలొ టెంట్లు కూలిపోయాయి. ప్రమాదకర స్థాయిలో గాలులు వీస్తుండటంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో సభ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది.