చెన్నమనేని రమేష్ కేసు….లో?

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటరు దాఖలుకు నెల రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని [more]

Update: 2021-02-17 00:57 GMT

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటరు దాఖలుకు నెల రోజులు గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్రం నిర్ణయం తీసుకుందని అదనపు ఏజీ వాదనలను విన్పించారు. హైకోర్టు ప్రారంభమయ్యాక భౌతిక విచారణ చేపట్టాలన్న చెన్నమనేని రమేష్ కోరారు. అయితే వారం రోజుల్లో విచారణ చేపట్టాలని కోరిన కేంద్ర ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరారు. వీలైనంత త్వరగా తేల్చాలని పిటీనర్ ఆది శ్రీనివాస్ కోరారు. జర్మనీ పౌరుడు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలన్న శ్రీనివాస్ తరుపున న్యాయవాది వాదించారు. ఈ విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News