ఆయన స్ట్రాటజీ ఫెయిల్ అవడం ఖాయం

Update: 2018-11-01 07:24 GMT

చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల ఆత్మాభిమానం తీసుకొనిపోయి ఢిల్లీలో కాంగ్రెస్ పాదాల వద్ద తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ... తెలుగు ప్రజలు కాంగ్రెస్, టీడీపీ పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఆత్మగౌరవం చంపుకుని కాంగ్రెస్ వద్దకు నాలుగు సీట్ల కోసం వెళ్లారని, కానీ, మాయావతి, ఎస్పీకి ఆత్మగౌరవం ఉంటుందని, వారు మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ తో కలిసి పొటీ చేయడం లేదని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ పార్టీకి దాసోహం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు ఎవరి రాష్ట్రంలో వారు ఎక్కువ స్థానాలు విజయం సాధించి కేంద్రంలో బలం పెంచుకోవాలనేది టీఆర్ఎస్ విధానమని పేర్కొన్నారు. ముందే జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తర్వాత ఏమీ డిమాండ్ చేయలేమని పేర్కొన్నారు. చంద్రబాబు స్ట్రాటజీ ఫెయిల్ అవుతుందని పేర్కొన్నారు.

Similar News