వంశీకి బాబు భరోసా

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన ఈ మేరకు వంశీకి పలు సూచనలు చేశారు. రాజకీయాలు వదలడం సరికాదని [more]

Update: 2019-10-28 01:40 GMT

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామాపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆయన ఈ మేరకు వంశీకి పలు సూచనలు చేశారు. రాజకీయాలు వదలడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడితే దానిపై పోరాడాలని రాజకీయాల నుంచి తప్పుకోవడం సరికాదని చంద్రబాబు సూచించారు. ఇంటి స్థలాలను క్రమబద్దీకరించడం తప్పేమీ కాదన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. వైసీపీ ప్రతీకార చర్యలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే రాజకీయ నేత లక్ష్యమన్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజీనామా చేయడం సరైన పరిష్కారం కాదన్నారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని చంద్రబాబు వంశీకి సూచించారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొందామన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News