నా నిర్ణయం కరెక్టే

పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యవిజయమన్నారు. హైకోర్టు తీర్పుతో తాము తీసుకున్న ఎన్నికల బహిష్కరణ [more]

Update: 2021-04-07 01:18 GMT

పరిషత్ ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యవిజయమన్నారు. హైకోర్టు తీర్పుతో తాము తీసుకున్న ఎన్నికల బహిష్కరణ నిర్ణయం సరైందేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు నాలుగు వారాలు సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ ఏకపక్ష నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం విడిచిపెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపర్చాలని చంద్రబాబు కోరారు. న్యాయస్థానాల మార్గదర్శకాలను థిక్కరించే తీరును జగన్ విడనాడాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News