సాయిరెడ్డి తోక కత్తిరించండి

విశాఖ అభివృద్ధికి తాను కష్టపడి పనిచేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలో ఆయన ప్రచారం నిర్వహించారు. విశాఖపట్నానికి ఏ2 విజయసాయిరెడ్డి శనిపట్టిందన్నారు. విశాఖలో భూములను కబ్జా [more]

Update: 2021-03-06 00:51 GMT

విశాఖ అభివృద్ధికి తాను కష్టపడి పనిచేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖలో ఆయన ప్రచారం నిర్వహించారు. విశాఖపట్నానికి ఏ2 విజయసాయిరెడ్డి శనిపట్టిందన్నారు. విశాఖలో భూములను కబ్జా చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు. దాడులు చేస్తూ టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏబీసీడీ రాజ్యం నడుస్తుందని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ను ఎంత అభివృద్ధి చేశానో? జగన్ వచ్చిన తర్వాత నాశనం చేశారని చంద్రాబాబు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News