చంద్రబాబు పీఏ పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కేసు నమోదయింది. కుప్పం మండలంలో నామినేషన్ వేయకుండా వైసీపీ అభ్యర్థిని బెదిరించినందుకు మనోహర్ పై కేసు [more]

Update: 2021-02-13 01:17 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పై కేసు నమోదయింది. కుప్పం మండలంలో నామినేషన్ వేయకుండా వైసీపీ అభ్యర్థిని బెదిరించినందుకు మనోహర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కుప్పం మండలంలోని వి.మిట్టపల్లి సర్పంచ్ పదవికి వైసీపీ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని మనోహర్ బెదిరింపులకు దిగారని మనోహర్ పై ఫిర్యాదు అందింది. దీంతో మనోహర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News