డీజీపీకి చంద్రబాబు లేఖ.. మరోసారి

టీడీపీ అధినేత చంద్రబాబు మరో మారు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. తంబళ్లపల్లిలో జరిగిన దాడి ఘటనను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో అరాచక ప్రభుత్వం [more]

Update: 2020-12-12 06:06 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు మరో మారు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. తంబళ్లపల్లిలో జరిగిన దాడి ఘటనను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతుందన్నారు. చట్టబద్దమైన పాలన రాష్ట్రంలో కన్పించడం లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి గండి కొడుతూ వైసీపీ నేతలు ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. దాడులకు శాంతియుతంగా నిరసనలను తెలుపుదామనుకుంటే టీడీపీ నేతలను అక్రమంటా అరెస్ట్ లు చేస్తున్నారని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News