గత పదిరోజులుగా చంద్రబాబు?

టీడీపీ అధినేత చంద్రబాబు పది రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈనెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలు [more]

Update: 2020-07-01 02:29 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు పది రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈనెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయన తనయుడు లోకేష్ మాత్రం ఏపీలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నా పార్టీ నేతలతో టచ్ లో ఉంటున్నారు.

Tags:    

Similar News