సలహాలిస్తుంటే.. వారి చేత బూతులు తిట్టిస్తారా?

కరోనాతో జనం భయపడుతుంటే జగన్ కు ఎన్నికలు కావాల్సి వచ్చాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే కరోనా పేరెత్తితే జగన్ కు చికాకు [more]

Update: 2020-04-14 08:55 GMT

కరోనాతో జనం భయపడుతుంటే జగన్ కు ఎన్నికలు కావాల్సి వచ్చాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతుంటే కరోనా పేరెత్తితే జగన్ కు చికాకు పుడుతుందన్నారు. కరోనాపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానితో సహా ప్రతిపక్షాలతో చర్చిస్తుంటే, జగన్ మాత్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదన్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోక పోబట్టే ఏపీలో కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. తాము ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సలహాలు ఇస్తుంటే వైసీపీ నేతలు బూతులు తిడుతున్నారన్నారు. నిర్లక్ష్యం వహిస్తే అందుకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయన్నారు. అన్నీ తనకు తెలుసుననుకునే అహంకారం నుంచి జగన్ బయటపడాలని చంద్రబాబు మీడియా సమావేశంలో కోరారు.

Tags:    

Similar News