కాంట్రాక్టర్లకు అయితే బిల్లులు..ఉద్యోగుల వేతనాల్లో మాత్రం?

కరోనా వైరస్ ను జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారని, అది ప్రమాదమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను కూడా పారదర్శకంగా [more]

Update: 2020-04-02 12:58 GMT

కరోనా వైరస్ ను జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారని, అది ప్రమాదమని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను కూడా పారదర్శకంగా ప్రకటించాలన్నారు. ఈ మేరకు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు ఎక్కువగా చేస్తున్నారని, ఏపీలోనే తక్కువ పరీక్షలు జరుగుతున్నాయని చంద్రబాబుతెలిపారు. ఏపీలో కేవలం నాలుగు ల్యాబ్ లు మాత్రమే ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. అన్నా క్యాంటిన్లు తెరచి పేదలు ఆకలికి లోనుకాకుండా చూడాలన్నారు. ఉద్యోగుల జీతాలను వాయిదా వేయడం సరికాదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. వైద్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకాలు అందించాలని చంద్రబాబు కోరారు. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నారని, ఉద్యోగులకు మాత్రం ఎందుకు జీతాల్లో కోత విధించారని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags:    

Similar News