భయపెట్టి గెలుచుకోవడానికి ఇదంతా

నిఘా పేరుతో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి ఎలా విడుదల చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత హడావిడిగా స్థానిక [more]

Update: 2020-03-07 11:31 GMT

నిఘా పేరుతో నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి ఎలా విడుదల చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ విధులను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా? అని చంద్రబాబు నిలదీశారు. నిఘా యాప్ ను ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. విపక్ష పార్టీ అభ్యర్థులను భయపెట్టడానికే ప్రభుత్వం ఇదంతా చేస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నిఘా పెట్టే బాధ్యత ఎన్నికల కమిషన్ దే కాని ప్రభుత్వానిది కాదని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలను నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు.

Tags:    

Similar News