బ్రేకింగ్ : ఎన్ కౌంటర్ చేయండి… షూట్ చేయండి

విశాఖ పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి తమను ఉదయం నుంచి కదలనివ్వకపోవడంపై ఆయన అహసనం వ్యక్తం చేశారు. [more]

Update: 2020-02-27 10:36 GMT

విశాఖ పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి తమను ఉదయం నుంచి కదలనివ్వకపోవడంపై ఆయన అహసనం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు గంటల నుంచి వైసీపీ నేతలు అడ్డుకున్నా పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేయలేదని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్ కౌంటర్ చేయాలని చంద్రబాబు అన్నారు. తన యాత్రకు అనుమతి ఉన్నా ఎందుకు అడ్డుకున్నారని పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. పక్కా ప్లాన్ తోనే వైసీపీ నేతలు అడ్డుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. బయట నుంచి రౌడీలను తీసుకు వచ్చి విశాఖల అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. తనను వెనక్కు వెళ్లిపోవాలన్న పోలీసుల సూచనలను తిరస్కరిస్తూ చంద్రబాబు ఎయిర్ పోర్టు బయట బైఠాయించారు.

Tags:    

Similar News