బ్రేకింగ్ : రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

ఐదుకోట్ల మంది వద్దంటే తనకు రాజధాని మార్చడానికి అభ్యంతరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చాలంటే రిఫరెండం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ [more]

Update: 2020-01-08 14:37 GMT

ఐదుకోట్ల మంది వద్దంటే తనకు రాజధాని మార్చడానికి అభ్యంతరం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానిని అమరావతి నుంచి మార్చాలంటే రిఫరెండం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అమరావతిలో చంద్రబాబు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అమరావతి జేఏసీ బస్సుయాత్రను ప్రారంభించేందుకు చంద్రబాబు పాదయాత్రగా వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బస్సు యాత్రను అడ్డుకోవడమేంటని చంద్రబాబు పోలీసుల మీద ఫైర్ అయ్యారు. తాను వెళ్లాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతుండటంతో పోలీసులు మాత్రం వెళ్లనిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. చంద్రబాబుతో పాటు సీపీఐ నేత రామకృష్ణను కూడా పోలీసులు అడ్డుకున్నారు. బెంజిసర్కిల్ నుంచి వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు నిలిపివేశారు. దౌర్యన్యం చేయడం మంచిది కాదని, అన్ని అనుమతులతోనే జేఏసీ బస్సుయాత్ర చేస్తుందని చంద్రబాబు అన్నారు. లేకుంటే రాష్ట్రంలో తిరుగుబాటు వస్తుందని, అప్పుడు పోలీసులు ఏమీ చేయలేరని చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు బెంజిసర్కిల్ వద్ద బైఠాయించారు.

Tags:    

Similar News