ఇక్కడ నా కులం ఉందా?

రాజధానిలో తన కులం లేదని, మతం లేదని, కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసమే తాను అమరావతిని రాజధానిని ఎంపిక చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రైతులకు [more]

Update: 2020-01-01 06:29 GMT

రాజధానిలో తన కులం లేదని, మతం లేదని, కేవలం రాష్ట్ర భవిష్యత్ కోసమే తాను అమరావతిని రాజధానిని ఎంపిక చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. రైతులకు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్న చంద్రబాబు రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది నూతన సంవత్సర వేడుకలు చేసే సమయం కాదన్నారు. కాపులు, యాదవులు, బ్రాహ్మణులు, గౌడ, ముస్లింలు, కమ్మ, ఎస్సీ, ఎస్టీలు అమరావతిలో ఉన్నారని చెప్పారు. రైతులు భూములు ఇచ్చింది తనపై విశ్వాసంతోనేనని చెప్పారు. ఇక్కడ రాజధాని ఉంటే ఇక్కడి పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో నివసించే వారిని మొదటి పౌరులగా గుర్తిస్తానని చెప్పారన్నారు. అమరావతిపై ఒక సామాజిక వర్గం ముద్ర వేశారని చెప్పారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలనే మైక్రోసాఫ్ట్ ఇక్కడకు తెచ్చానన్నారు.

Tags:    

Similar News