చంద్రబాబు నేడు రాజధానిలో

కొత్త సంవత్సరం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా రైతులకు సంఘీభావం తెలపనున్నారు. రాజధాని రైతులు గత పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. [more]

Update: 2020-01-01 03:31 GMT

కొత్త సంవత్సరం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా రైతులకు సంఘీభావం తెలపనున్నారు. రాజధాని రైతులు గత పదిహేను రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాజధానిని అమరావతి నుంచి తరలించ వద్దంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోకుండా రైతులకు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆయన తన సతీమణి భువనేశ్వరి తో కలసి రాజధాని రైతుల ఆందోళనలో పాల్గొంటారు వివిధ గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవనున్నారు.

Tags:    

Similar News