జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకోవాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సోనియా గాంధీ సయితం డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. [more]

Update: 2019-12-02 10:55 GMT

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకోవాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. సోనియా గాంధీ సయితం డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీటీడీ ప్రతిష్టను వైసీపీ ప్రభుత్వం మంటగలుపుతుందన్నారు. మంత్రులు, స్పీకర్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రంగుల పిచ్చి పరాకాష్టకు చేరుకుందన్నారు. రాష్ట్రాన్ని జగన్ వెనక్కు తీసుకుపోతున్నారన్నారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ ను అభివృద్ధి చేసింది తానేనన్నారు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపులను కొట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టిన ఘనత తమదేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News