వారం రోజులు సమయమిస్తున్నా

పోలీసులకు వారం రోజులు సమయమిస్తున్నానని, వైసీపీ బాధితులను గ్రామాలకు తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరారు. లేకుంటే తాను దగ్గరుండి వారి గ్రామాలకు తీసుకెళ్తానని తెలిపారు. వైసీపీ [more]

Update: 2019-09-03 12:15 GMT

పోలీసులకు వారం రోజులు సమయమిస్తున్నానని, వైసీపీ బాధితులను గ్రామాలకు తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోరారు. లేకుంటే తాను దగ్గరుండి వారి గ్రామాలకు తీసుకెళ్తానని తెలిపారు. వైసీపీ తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని కోరారు. ధైర్యముంటే తనపై దాడి చేయాలన్నారు. ఇప్పటికే ఏడుగురు టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారన్నారు. రోడ్డుపై ఎక్కడైనా? ఎప్పుడైనా గోడకట్టడం చూశామా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతి బాధిత కుటుంబానికి టీడీపీ తరుపున పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందచేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Tags:    

Similar News