వైసీపీ నేతలు వస్తే నిలదీయండి

వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు నిచ్చారు. రెండేళ్లలో ఏమీ చేయకుండా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్నారు. టీడీపీ, [more]

Update: 2021-04-12 01:39 GMT

వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారానికి వస్తే నిలదీయమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపు నిచ్చారు. రెండేళ్లలో ఏమీ చేయకుండా ఎన్నికల ప్రచారానికి వస్తున్నారన్నారు. టీడీపీ, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రెండేళ్లలో ఏపీకి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సంక్షేమ పథకాలను అన్నీ ఎత్తివేశారన్నారు. పనబాక లక్ష్మి అనుభవమున్న నేత అని, మిగిలిన అభ్యర్థులకు రాజకీయ అనుభవం లేదని చంద్రబాబు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News