శారదాపీఠంలో క్షుద్రపూజలు జరుగుతున్నాయి.. బాంబు పేల్చిన బాబు

స్వరూపానందేంద్ర స్వామిజీ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. దొంగస్వామి చేతుల్లో రాష్ట్రం చీకట్లోకి నెట్టివేయబడుతుందన్నారు. ముఖ్యమంత్రి శారదాపీఠం వెళ్లి వచ్చిన వెంటనే డీజీపీ కూడా [more]

Update: 2021-02-22 08:22 GMT

స్వరూపానందేంద్ర స్వామిజీ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. దొంగస్వామి చేతుల్లో రాష్ట్రం చీకట్లోకి నెట్టివేయబడుతుందన్నారు. ముఖ్యమంత్రి శారదాపీఠం వెళ్లి వచ్చిన వెంటనే డీజీపీ కూడా అక్కడకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరిగితే ఈవో శారదాపీఠాన్ని ఆశ్రయించారన్నారు. ఈ స్వామీజీకి ఏం శక్తులున్నాయని ప్రశ్నించారు. శారదాపీఠంలో క్షుద్రపూజలు జరుగుతన్నాయన్నారు. తమను చంపేందుకు స్వామీజీ క్షుద్రపూజలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. స్వాములంటే సర్వం త్యాగం చేయాలని, భోగాలు అనుభవించేవాళ్లు స్వాములేంటని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగస్వామి చేతుల్లో ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్ ను పెట్టారన్నారు చంద్రబాబు.

Tags:    

Similar News