ఎవరూ భయపడ వద్దండి

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే, వైసీపీ దానిని ధ్వంసం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. [more]

Update: 2021-02-04 01:13 GMT

ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంటే, వైసీపీ దానిని ధ్వంసం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. వైసీపీ నేతలు ఎవరైనా బెదరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని, కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపిరు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా జరగడం జగన్ కు ఇష్టం లేదని, తప్పుడు కేసులు పెడుతూ టీడీపీ నేతలను బెదిరించాలని చూస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఎవరూ భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News