పట్టాభి ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దాడికి గురయిన పట్టాభిని పరామర్శించారు. విజయవాడలోని ఆయన ఇంటికి స్వయంగా చంద్రబాబు వచ్చి పరిశీలించారు. దుండగుల దాడిలో ధ్వంసమయిన పట్టాభి కారును చంద్రబాబు [more]

Update: 2021-02-02 07:12 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు దాడికి గురయిన పట్టాభిని పరామర్శించారు. విజయవాడలోని ఆయన ఇంటికి స్వయంగా చంద్రబాబు వచ్చి పరిశీలించారు. దుండగుల దాడిలో ధ్వంసమయిన పట్టాభి కారును చంద్రబాబు పరిశీలించారు. తనకు ప్రాణహాని ఉందని పట్టాభి చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ఆరోపించారు. రెండునెలల్లో రెండుసార్లు పట్టాభిపై దాడి జరిగిందన్నారు. పోలీసులు వైసీపీ గూండాలకు కొమ్ము కాస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని తెలిపారు.

Tags:    

Similar News