ఈ రాష్ట్రాన్ని మీరే రక్షించుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యతను యువత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక మంది యువత పై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందన్నారు. సోషల్ [more]

Update: 2021-01-12 05:49 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యతను యువత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అనేక మంది యువత పై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై లెక్కకు మించి కేసులు పెట్టారన్నారు. ఇక రాజ్యాంగ వ్యవస్థలను కూడా వైసీపీ ప్రభుత్వం బెదిరిస్తుందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధానంగా శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, మీడియాలను కూడా ప్రభుత్వం బెదిరించి లొంగదీసుకోవాలని చూస్తుందన్నారు. యువతే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News