ప్రపంచమంతా గుర్తిస్తున్నా.. జగన్ మాత్రం?

ప్రపంచమంతా వైద్యుల సేవలను గుర్తిస్తూ పూలు చల్లుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం వైద్యులను పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైద్యులకు కనీసం మాస్క్ [more]

Update: 2020-07-01 06:43 GMT

ప్రపంచమంతా వైద్యుల సేవలను గుర్తిస్తూ పూలు చల్లుతుంటే వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం వైద్యులను పట్టించుకోవడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైద్యులకు కనీసం మాస్క్ లు, పీపీఈ కిట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. వాటి కోసం వైద్యులు ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. ఇందుకు డాక్టర్ సుధాకర్ ఉదంతమే నిదర్శనమన్నారు. దేశమంతా వైద్యులను గుర్తిస్తుంటే ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. వైద్యులు ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు. ఇకనైనా ప్రభుత్వం వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News