నా మంచితానాన్నే చూశారు

తన మంచి తనాన్నే చూశారని, ఇకపై ఏం జరుగుతుందో చూస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును వందరోజులైనా పరిశోధించ లేకపోయారని, [more]

Update: 2019-09-04 12:52 GMT

తన మంచి తనాన్నే చూశారని, ఇకపై ఏం జరుగుతుందో చూస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసును వందరోజులైనా పరిశోధించ లేకపోయారని, ఇక జగన్ రాష్ట్నాన్ని ఏం కాపడతారని ప్రశ్నించారు. వైఎస్ వివేకాహత్య కేసులో అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అతడి వద్ద నుంచి రెండు సూసైడ్ నోట్ లు లభించాయంటున్నారన్నారు. రెండు నోట్ లలో వేర్వేరు చేతిరాతలు ఉన్నాయన్నారు చంద్రబాబు. కేబినెట్ మీటింగ్ లో శాంతిభద్రతలపై ఎందుకు చర్చించలేదన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఏర్పాటు చేసిన వైసీీపీ బాధితుల శిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. వైసీపీ బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఏపీలో ప్రజలు మళ్లీ టీడీపీ రావాలని బలంగా కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News