వైఎస్ ను కేసీఆర్ పొగడటం ఏంటి..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై గతంలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు పొగుడుతున్నారని, వైసీపీ – టీఆర్ఎస్ లాలూచీకి ఇది నిదర్శనమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. [more]

Update: 2019-01-21 06:39 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై గతంలో విమర్శలు చేసిన కేసీఆర్ ఇప్పుడు పొగుడుతున్నారని, వైసీపీ – టీఆర్ఎస్ లాలూచీకి ఇది నిదర్శనమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేంద్ర మోదీ డైరెక్షన్ లోనే టీఆర్ఎస్, వైసీపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ – టీఆర్ఎస్ కుమ్మక్కు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. పార్టీ నేతలకు ఈ సమయం ఎంతో కీలకమైనదని, అందరూ ప్రజల్లోనే ఉండాలన్నారు. కాగా, వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం అద్భుతమైన పథకమని నిన్న తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News