వైసీపీ వాళ్లు తెగ ఆనందపడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం గెలిచేది తెలుగుదేశం పార్టీనే అని, సర్వేలను ఎవరూ నమ్మొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… [more]

Update: 2019-05-20 08:20 GMT

ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం గెలిచేది తెలుగుదేశం పార్టీనే అని, సర్వేలను ఎవరూ నమ్మొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… గత ఎన్నికల సమయంలోనూ జాతీయ సర్వే సంస్థలు వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాయని, ఆ సర్వేలతో వైసీపీ వాళ్లు మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా మళ్లీ ఎగ్జిట్ పోల్స్ తో మళ్లీ వైసీపీ మంత్రివర్గాన్ని తయారుచేసుకుంటుందన్నారు. వైసీపీ వాళ్లు చాలా ఆనంద పడుతున్నారని, వారి ఆనందం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల సంఘం అన్ని విధాలుగా విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపించారు. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలని కోరుతున్నా ఎన్నికల సంఘం ఒప్పుకోవడం లేదన్నారు. ఇందుకోసం పోరాటం చేస్తామని, ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలను పంపించకుండా ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు.

Tags:    

Similar News