ఏపీని జగన్ మరో బీహార్ చేస్తారా…?

ఆంధ్రప్రదేశ్ ను మరో బిహార్ లా మార్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇవాళ టీడీపీ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ లో [more]

Update: 2019-02-26 07:47 GMT

ఆంధ్రప్రదేశ్ ను మరో బిహార్ లా మార్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇవాళ టీడీపీ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. గతంలో హైదరాబాద్ లో మతకల్లోల్లాలు సృష్టించారని, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే గల్లీగల్లీకి ఒక రౌడీ తయారవుతారని జోస్యం చెప్పారు. ఎర్రచందనం ఆదాయం పోయేసరికి వైసీపీకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందన్నారు. అందుకే అరాచకాలు సృష్టిస్తుందని, చిత్తూరు, ఒంగోలు, దెందులూరు ఘటనలే ఇందుకు ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు. రౌడీయిజంపై ఉక్కుపాదం మోపేది టీడీపీ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా పట్ల జాగ్రత్తగా ఉండాలని శ్రేణులకు ఆయన సూచించారు.

Tags:    

Similar News