రాజ‌కీయ‌ల‌బ్ధి కోసం చ‌నిపోయిన వారిని కించ‌ప‌రుస్తారా..?

23వ తేదీ త‌ర్వాత న‌రేంద్ర‌ మోడీని, అత‌ని టీమ్ ను దేశ‌ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌డం ఖాయమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. త‌న‌పై న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌కు [more]

Update: 2019-05-11 05:47 GMT

23వ తేదీ త‌ర్వాత న‌రేంద్ర‌ మోడీని, అత‌ని టీమ్ ను దేశ‌ప్ర‌జ‌లు తిర‌స్క‌రించ‌డం ఖాయమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. త‌న‌పై న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు. ఔటైన బ్యాట్స్ మెన్ ఎంపైర్ ను దూషించిన‌ట్లు చంద్ర‌బాబు ఈసీపై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని నిన్న మోడీ కామెంట్ చేశారు. అయితే, ఎంపైర్లు లేకుండా చేసి, రిఫ‌రీ విధానాన్ని ధ్వంసం చేస్తున్న మోడీ టీమ్ ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు పేర్కొన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌క్ర‌మంగా ఆడే కొత్త టీమ్ నే ప్ర‌జ‌లు ఎన్నుకుంటార‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడుకుంటార‌ని అన్నారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం చ‌నిపోయిన వారిని, నాయ‌కుల కుటుంబ‌సభ్యుల‌ను కూడా కించ‌ప‌రిచేందుకు న‌రేంద్ర మోడీ వెనుకాడ‌ర‌న్నారు. ర‌క్ష‌ణ శాఖ‌ను, సైన్యాన్ని కూడా రాజ‌కీయ లాభం కోసం వాడుకుంటార‌ని, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టి, రాజ‌కీయ నాయ‌క‌త్వాన్ని చంపేస్తార‌ని, అటువంటి వారు త‌మ‌కు నీతులు చెబుతున్నార‌ని అన్నారు. త‌మ పోరాటం ఎన్నిక‌ల సంఘంపైన కాద‌ని, వివ‌క్ష‌తో ప‌నిచేస్తున్న అధికారుల పైనే అని స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News