చంద్ర‌బాబు చెప్పిన‌ట్లే ప్యాకేజీ ఇచ్చాం

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన‌ట్లుగా ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో మార్పులు చేసి అమ‌లు చేశామ‌ని కేంద్రమంత్రి పియూష్ గోయ‌ల్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ [more]

Update: 2019-02-12 11:27 GMT

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన‌ట్లుగా ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో మార్పులు చేసి అమ‌లు చేశామ‌ని కేంద్రమంత్రి పియూష్ గోయ‌ల్ స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం రాజ్య‌స‌భ‌లో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చిన ఆయ‌న‌… కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదాకు ప్ర‌త్యామ్నాయం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీని చంద్ర‌బాబు స్వాగ‌తించార‌ని… ఈ మేర‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ కేంద్రానికి లేఖ కూడా రాశార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్యాకేజీలో రాష్ట్ర‌ప్రభుత్వం సూచించిన మార్పులు చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

Tags:    

Similar News