సోనియా కుటుంబానికి షాక్

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబంలో ఇప్పటికే పలువురు హత్యకు [more]

Update: 2019-11-08 10:54 GMT

సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబంలో ఇప్పటికే పలువురు హత్యకు గురికావడంతో వారి కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. ఈ మేరకు పార్లమెంటులో అప్పుడు చట్టం కూడా చేశారు. అయితే తాజాగా మోదీ సర్కార్ వీరికి ఎస్పీజీ భద్రతను తొలగించాలని నిర్ణయించింది. వీరికి జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇస్తే చాలని అభిప్రాయపడుతోంది. త్వరలోనే ఎస్పీజీ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది.

Tags:    

Similar News