బ్రేకింగ్ : ఆ లేఖ నిమ్మగడ్డ రాసిందే

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి హోంశాఖ కార్యదర్శికి లేఖ అందిందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తమకున్న సమాచారం మేరకు [more]

Update: 2020-03-20 05:43 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి హోంశాఖ కార్యదర్శికి లేఖ అందిందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తమకున్న సమాచారం మేరకు ఈ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసినట్లు తెలిసిందన్నారు. అయితే ఒక అధికారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందన్నారు. అందుకోసమే తాము కేంద్ర బలగాలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు భద్రత కల్పించామని చెప్పారు. అది రాష్ట్ర పరిధిలోని అంశమైనా కొన్ని విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు.

Tags:    

Similar News