టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై చీటింగ్ కేసు నమోదు

Update: 2018-11-23 08:49 GMT

ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిపై కేసు నమోదైంది. పోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి తమ ఆస్తిని కాజేశారని ఆయన బంధువు లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు సామ రంగారెడ్డిపై 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ టిక్కెట్ ఆశించిన రంగారెడ్డికి పార్టీ అధిష్ఠానం అనేక ఆసక్తికర పరిణామాల్లో ఇబ్రహీంపట్నం టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News