నేటి నుంచి హైకోర్టులో రాజధాని కేసుల విచారణ

రాజధాని అమరావతి పై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. నేటి నుంచి [more]

Update: 2021-08-23 03:07 GMT

రాజధాని అమరావతి పై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. నేటి నుంచి హైకోర్టులో అమరావతిపై రోజు వారీ విచారణ పై నిర్ణయం తీసుకోనుంది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణకు సంబంధించి రాజధాని అమరావతి రైతులతో పాటు అనేక మంది పిటీషన్లు దాఖలు చేశారు. ఈ కేసులపై ఏపీ హైకోర్టు నేటి నుంచి విచారణ జరపనుంది. ఇప్పటికే గత ఏడాదిగా రాజధాని కేసులు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి.

Tags:    

Similar News