ఫిరాయింపు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కు చుక్కుదెరైంది. ఇవాళ నియోజకవర్గ పర్యటనలో ఉన్న [more]

Update: 2019-05-04 06:54 GMT

కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కు చుక్కుదెరైంది. ఇవాళ నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఆమెను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పార్టీ మారారని ఆరోపిస్తూ ఆమె కాన్వాయ్ పై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ప్రతిదాడి చేశారు. కామేపల్లి మండలం గోవింద్రలో ఈ ఘటన జరిగింది. కాగా, కాంగ్రెస్ నుంచి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన హరిప్రియా నాయక్ టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ఎన్నికల ప్రచార సమయంలో తాను పార్టీ మారనని ప్రమాణం కూడా చేయడం గమనార్హం

Tags:    

Similar News