బుగ్గన బరిలోకి దిగారు....!

Update: 2018-06-19 09:46 GMT

పీఏసీ ఛైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తాను బీజేపీ జాతీయ స్థాయి నేతలకు ప్రభుత్వ రహస్య పత్రాలను అందించానని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజానామా చేస్తానాని, లేకుంటే మీరు రాజీనామాచేస్తారా? అని ప్రశ్నించారు. తనపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న బురద జల్లే కార్యక్రమానికి బుగ్గన ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయన టీడీపీ నేతలపై ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. తనపై అనవసర వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ లపై బుగ్గన ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఏపీ భవన్ లోని లాగ్ బుక్ ను టీడీపీ నేతలు ట్యాంపరింగ్ చేశారన్నారు. బీజేపీ, టీడీపీ బంధమేంటో అందరికీ తెలుసునన్నారు.

Similar News