బ్రేకింగ్ : బాబుకు బొత్స కౌంటర్ ఇదే

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బాబుకు బొత్స ప్రతి సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు మతిస్థిమితం పూర్తిగా లేదనిపిస్తోందన్నారు. [more]

Update: 2020-08-03 13:18 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. బాబుకు బొత్స ప్రతి సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు మతిస్థిమితం పూర్తిగా లేదనిపిస్తోందన్నారు. 16 నెలల క్రితమే ఎన్నికలు జరిగాయని, అది ప్రజల తీర్పు కాదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 16 నెలల క్రితం మంగళగిరి, తాడికొండల్లో ఫలితాలు ఎవరి వైపు ఉన్నాయని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 16 నెలల క్రతం ప్రజలు ఇచ్చిందే అసలైన తీర్పు అన్నారు. గ్రాఫిక్స్ రాజధానిని చూపించి ప్రజలను మోసం చేశారన్నారు. తమ బినామీల భూముల విలువ పెంచుకునేందుకే ఆ నాటకమాడారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాజీనామా చేయాలని బొత్స సత్యనారాయణ ప్రతి సవాల్ విసిరారు.

Tags:    

Similar News