టీడీపీ వాళ్లకు టెస్ట్ లు చేయించమంటారా?

హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేయడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం [more]

Update: 2020-04-01 06:47 GMT

హైదరాబాద్ లో కూర్చుని విమర్శలు చేయడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైతే టీడీపీ వాళ్లకు కూడా టెస్ట్ లు చేస్తామని బొత్స సత్యనారాయణ ఘాటుగా బదులిచ్చారు. ఇటు కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నిస్తూనే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ ఘటన వల్లనే ఏపీలో కేసులు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. కరోనా సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు. చేసిన పనుల విషయంలో తమ ప్రభుత్వం ప్రచారం చేసుకోక పోయి ఉండవచ్చని బొత్స ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News