Bonda uma : డీఐజీ ర్యాంక్ అధికారులు గంజాయి వ్యాపారంపై?

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండ ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది వైసీపీ నేతలేనని ఆయన అన్నారు. [more]

Update: 2021-09-24 05:56 GMT

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండ ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది వైసీపీ నేతలేనని ఆయన అన్నారు. పక్క రాష్ట్రాల ప్రభుత్వాల సయితం ఆంధ్ర బోర్డర్ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చాయని బొండా ఉమ ఎద్దేవా చేశారు. 9 వేల కోట్లు హెరాయిన్ దొరికితే రాష్ట్రానికేమీ సంబంధంలేదని డీజీపీ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. డీఐజీ ర్యాంకు అధికారులు కూడా గంజాయి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారని బొండా ఉమ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం వ్యాపారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బొండా ఉమ అన్నారు.

Tags:    

Similar News