బ్రేకింగ్ : చివరి నిమిషంలో పార్టీ మారినా లక్కీ ఫెలోనే...!!

Update: 2018-12-11 14:04 GMT

కోదాడ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి ఓటమి పాలయ్యారు. ఇక్కడ చివరి నిమిషంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్ 668 ఓట్లతో గెలుపొందారు. కోదాడలో ప్రచారం చివరిరోజు రాహుల్ గాంధీ, చంద్రబాబు భారీ సభను ఏర్పాటు చేసి పద్మావతిని గెలిపించాలని కోరారు. పద్మావతి గత ఎన్నికల్లో గెలిచినా ఇప్పుడు ఓటమి పాలయ్యారు. బొల్లం మల్లయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ కూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగా ఆయనకు టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన చివరి నిమిషంలో టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి జంప్ చేసి విజయం సాధించారు. లక్కీఫెలో మల్లయ్య యాదవ్.

Similar News