నల్ల రిబ్బన్ లు కట్టుకుని ఆడుతోన్న టీం ఇండియా

Update: 2018-08-18 14:25 GMT

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మృతికి టీం ఇండియా సంతాపం తెలిపింది. అటల్ జీ మృతి సంతాపంగా శనివారం ఇంగ్లాండ్ తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్ లను ధరించి ఆడుతున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 177 పరుగులు సాధించింది. కోహ్లీ 51 పరుగులు, అజింక్య రహానే 46 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

Similar News